తాము చేస్తున్న కర్మలవలన మనుజుల గుణము బయటపడుతుంది. వ్యక్తిలో దాగివున్న సత్వ, రజో, తమో గుణములు కర్మలరూపంలో తేటతెల్లమవుతాయి. ఎంత కపటమును ప్రదర్శించినా కూడా అవి ఒకానొకప్పుడు బయటపడితీరుతాయి. అందుకే భగవతార్పణబుద్ధితో కర్మలనాచరించమని భగవద్గీత చెబుతుంది. ఎందుకంటే ఏదైనా భగవంతునికి అర్పించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉంటాము కాబట్టి. ఇలా చేయడంవలన మానవులు చేయు దుష్కర్మలు కొన్నాళ్ళకు సత్కర్మలుగా మారతాయి.
శ్రీమాతా జ్యోతిషాలయం
THIS BLOG BELONGS TO VEDIC ASTROLOGY
28, నవంబర్ 2023, మంగళవారం
జీవ ప్రజ్ఞ
29.11.2023 పంచాంగం
శ్రీ గురుభ్యోనమః
మంగళవారం, నవంబరు 28,2023
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం - శరదృతువు
కార్తీక మాసం - బహుళ పక్షం
తిథి:పాడ్యమి మ1.40 వరకు
వారం:మంగళవారం (భౌమవాసరే)
నక్షత్రం:రోహిణి మ1.55 వరకు
యోగం:సిద్ధం రా11.14 వరకు
కరణం:కౌలువ మ1.40 వరకు తదుపరి తైతుల రా1.39 వరకు
వర్జ్యం:ఉ.శే.వ7.29వరకు & రా7.38 - 9.17
దుర్ముహూర్తము:ఉ8.28 - 9.13 &
మ10.30 - 11.22
అమృతకాలం:ఉ10.42 - 12.18 &
తె5.27నుండి
రాహుకాలం:మ3.00 - 4.30
యమగండ/కేతుకాలం:ఉ9.00 -10.30
సూర్యరాశి:వృశ్చికం
చంద్రరాశి:వృషభం
సూర్యోదయం:6.15
సూర్యాస్తమయం: 5.20
సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
27, నవంబర్ 2023, సోమవారం
జననకాల నక్షత్ర దోషాలు
పిల్లలు పుట్టినప్పుడు నక్షత్రము మంచిదేనా ? దోషములేమైనా ఉన్నాయా ? శాంతి అవసరమా ? అను సందేహము ప్రతి తల్లిదండ్రులకు కలుగుతుంది. ఏ నక్షత్రములలో జన్మించినపుడు ఏ దోషములు కలుగు తాయి దోష పరిహారములు ఏమిటి ? దోష నక్షత్రములలో జన్మించిన పిల్లలకు నక్షత్ర జపము, నవ గ్రహ శాంతి, హోమము, నూనెలో నీడలు చూచుట, రుద్రాభిషేకము, మొదలగు శాంతిని తప్పని సరిగా జరిపించాలి. కొన్ని విశేష శాంతి కలిగిన నక్షత్రములకు శాస్త్రోక్తముగా విశేష శాంతి చేయాలి.
1. అశ్విని 1 వ పాదములో జన్మంచిన పిల్లల వలన తండ్రికి దోషం. ఈ దోషము 3 నెలలు ఉండును. ఇక్కడ గమనించ వలసిన విషయము రేవతి, అశ్విని నక్షత్రముల మధ్య సుమారు 48 నిమిషములు సంధి కాలము ఉంటుంది. ఈ సంధి సమయములో జన్మించిన శిశువుకు ఆయుర్దాయము తక్కువగా ఉంటుంది. అశ్విని 2 3 4 పాదములలో జన్మించిన వారికి దోషములేదు.
2. భరణి 1 2 4 పాదములలో జన్మంచిన వారికి దోషములేదు. 3 వ పాదములో ఆడపిల్ల పుడితే తల్లికి, మగపిల్ల పుడితే తండ్రికి దోషం కలుగును. ఈ దోషము 23 దినముల వరకు ఉంటుంది.
3. కృత్తిక నక్షత్రములో 3 వ పాదములో జన్మంచిన స్త్రీ తల్లికి పురుషుడు తండ్రికి సామాన్య దోషం కలుగ చేయును. 1 2 4 పాదములలో జన్మంచిన వారు స్వల్ప దోషమును కలుగ చేయుదురు.
4. రోహిణి నక్షత్రము 1 వ పాదములో జన్మించిన మేనమామకు, 2 వ పాదము తండ్రికి, 3 వ పాదము తల్లికి దోషమని 4 వ పాదము దోషము లేదని కొందరి అభిప్రాయము. సామాన్యముగా ఈ నక్షత్రములో పుట్టడం వలన మేనమామకు గండము. తప్పక శాంతి అవసరము . శ్రీ కృష్ణ పరమాత్ముడు ఈ నక్షత్రము నందే జన్మించాడు. మేనమామ గండములో పుట్టాడు . అందు వలననే కంసుడు నాశనమయ్యాడనీ పురాణ వచనము.
5. మృగశిర 1 2 3 4 పాదములలో జన్మించిన వారికి ఏ విధమైన దోషములు ఉండవు.
6. ఆరుద్ర నక్షత్రము 1 2 3 పాదములలో జన్మంచిన వారికి దోషము లేదు 4 వ పాదమున జననము జరిగిన సామాన్య శాంతి అవసరము.
7. పునర్వసు నక్షత్రము 1 2 3 4 పాదములు అన్నీ మంచివే. ఏ విధమైన శాంతి అవసరము లేదు.
8. పుష్యమి నక్షత్రము కర్కాటక లగ్నములో పగటి సమయమున పురుషుడు పుట్టిన తండ్రికి గండము కలుగును. రాత్రి సమయాన స్త్రీ జన్మించినచో తల్లికి గండము కలుగును. పుష్యమి నక్షత్రములో జన్మించిన వారివలన 1 వ పాదము మేనమామలకు 2 పాదములలో తల్లి తండ్రులకు దోషము కలిగింతురు. మూడు, నాల్గవ పాదమున పుట్టిన వారికి సామాన్య దోషము కలుగును. వీరికి శాస్త్రోక్తముగా శాంతిని చేయించాలి.
9. ఆశ్లేష నక్షత్రములో 1 వ పాదమున పుట్టినవారికి దోషము లేదు. 2 వ పాదము శిశువునకు 3 వ పాదము తల్లికి, 4 వ పాదము తండ్రికి దోషము. నాలుగవ పాదము న జన్మించిన వారికి విశేష శాంతి చేయించుట అవసరము. ఈ నక్షత్రము యొక్క చివరన 24 నిమిషములు సంధి ఉండును.
10. మఖ నక్షత్ర 1 వ పాదములో జననమైతే 5 నెలల వరకు తండ్రికి దోషము. మఖ నక్షత్ర ప్రారంభ సమయములో మొదటి 24 నిమిషములు అత్యంత దోషము. 3 వ పాదమున పుట్టిన వారి వలన తల్లి తండ్రి ఇద్దరకి దోషము. 2, 4 పాదములలో జన్మించిన దోషము లేదు.
11. పుబ్బ నక్షత్రములో 1 2 3 4 పాదములలో జన్మించిన వారికి దోషము లేదు.
12. ఉత్తర నక్షత్ర 1, 4 వ పాదములలో జననము జరిగిన యెడల తల్లి, తండ్రి, అన్నలకు దోషము కలుగును. మిగతా 2 3 పాదములలో పుట్టిన వారికి దోషము లేదు.
13. హస్తా నక్షత్ర 3 వ పాదమున పుట్టిన పురుషుని వలన తండ్రికి, స్త్రీ వలన తల్లికి దోషము కలుగును. మిగతా 1 2 4 పాదములలో జన్మించిన వారికి దోషము లేదు.
14. చిత్త నక్షత్రములో 1 వ పాదము తండ్రికి, 2 వ పాదము తల్లికి 3 వ పాదము తోడ పుట్టిన వారికి దోషము కలిగిస్తుంది. నాల్గవ పాదములో జన్మించిన వారికి సామాన్య దోషము కలుగును.
15. స్వాతి నక్షత్రమున 1 2 3 4 పాదములలో ఏ పాదమున జన్మించిననూ దోషము లేదు.
16. విశాఖ నక్షత్రము జన్మించిన వారికి మరుదులు మరియు బావలకు దోషము కలుగును. 1 2 3 4 ఏ పాదములో పుట్టిననూ బంధువులకు గండము. విశేష శాంతి అవసరము.
17. అనూరాధ నక్షత్రము 1 2 3 4 పాదములలో జన్మించుట వలన దోషము లేదు.
18 . జ్యేష్ట నక్షత్రము ఈ నక్షత్రము విశేష శాంతి కలిగిన నక్షత్రము. దీనిలో 1 2 3 4 ఏ పాదములో జన్మించినా దోషమే. జాతకుల పుట్టిన రోజున ఉన్న జ్యేష్ట నక్షత్రము మొత్తము సమయాన్ని 10 భాగములు చేయాలి. అందులో ఏ భాగములో పుడితే ఆ భాగ సంబందము కలవారికి తప్పక నాశనము కలుగును.1 వ భాగములో తాతయ్యకు, 2 అమ్మమ్మకు, 3 తల్లి తోడ బుట్టిన వారికి, మేనమామలకు 4 అన్నలకు, అక్కలకు 5 శిశువునకు, 6 ఎవ్వరికి దోషము ఉండదు, 7 వివాహ సమయములో అత్త వారి బంధు వర్గమునకు, 8 జాతకునకు, 9 తల్లికి, 10 తండ్రికి దోషము కలుగ చేయును. మరియు నాల్గవ పాదమున జననమైతే తండ్రికి దోషము. ఇది సమారు 9 నెలలు ఉండును. విశేష శాంతి చేయించాలి .
19. మూల నక్షత్రము ఈ నక్షత్రము ప్రారంభమున 24 నిమిషములు సంధి ఉండును. ఈ నక్షత్రములో 1 వ పాదమున జనన మయిన వారి తండ్రికి, 2 వ పాదము తల్లికి, 3 వ పాదము ధనమునకు నాశనము కల్గించును, 4 వ పాదమున జననము జరిగిన దోషము లేదు. మూలా నక్షత్ర సమయమును మొత్తం 12 భాగాలుగా విభజించి దోషమును తెలుసు కోవాలి.
పన్నెండు భాగాలలో1 వ భాగము తండ్రికి దోషము, 2 తల్లికి, 3 అన్నలకు, 4 భాగస్వాములకు, 5 పిల్లనిచ్చిన మామగారికి, 6 చిన్నాన్న, పెద్ద నాన్నలకు 7 పిన్నమ్మ, పెద్దమ్మలకు మరియు మేనమామలకు. 8 ధనమునకు, 9 జీవన నాశనము, 10 దరిద్రమును కల్గిస్తుంది, 11 భ్రుత్యులు, 12 జాతకునికి నాశనము కలుగ చేయును.జ్యేష్ట ,మూలా నక్షత్రములలో జన్మించిన వారి దోషము వివాహ కాలము వరకు ఉండును. నవ గ్రహ శాంతి, జప, తప, దానములు ఇచ్చుట వలన దోషములు తొలగును.
20. పూర్వాషాడ నక్షత్రము పగటి వేళలో కుమారుడు జన్మించినపుడు తండ్రికి ఆపదలు కలుగును. 2 , 3 వ పాదములలో స్త్రీ గానీ పురుషుడు గానీ ఎవరు పుట్టిననూ తల్లి తండ్రి ఇద్దరికీ గండము. 4 వ పాదమున జననము దోషము లేదు.
21. ఉత్తరాషాడ నక్షత్రము 1 2 3 4 పాదములలో జననము దోషము లేదు.
22. శ్రవణం నక్షత్రము 1 2 3 4 పాదములలో జననము దోషము లేదు.
23. ధనిష్ట నక్షత్రము 1 2 3 4 పాదములలో జననము దోషము లేదు.
24. శతభిషం నక్షత్రము 1 2 3 4 పాదములలో జననము దోషము లేదు.
25. పూర్వాబాద్ర నక్షత్రము 1 2 3 పాదములలో జననము దోషము లేదు. నాల్గవ పాదము సామాన్య దోషము .
26. ఉత్తరాభాద్ర నక్షత్రము 1 2 3 4 పాదములలో జననము దోషము లేదు.
27. రేవతి నక్షత్రము 1 2 3 పాదములలో జననము దోషము లేదు. 4 వ పాదమున దోషము. ఈ రేవతి నక్షత్రము చివరి ఘడియలలో జన్మించిన మృత్యుంజయ జపములు రుద్రాభిషేకము తప్పని సరిగా చేయించాలి.
* ఈ నక్షత్రములనే కాక ప్రేగులు మేడలో వేసుకుని పుట్టిన, కాళ్ళు మొదట బయటకు వస్తు జననం జరిగినా, దుష్ట తిధి దోషము, వర్జ్యము, దుర్ముహూర్త కాలముల యందునూ, గ్రహణ సమయములలోనూ జన్మించిన వారికి శాంతి చేయించుట మఖ్యము.
* జన్మ పత్రిక ఎప్పుడు వ్రాయించుకోవాలి:- శిశువు జన్మించిన తర్వాత 'పురుడు' అయిన తరవాత జన్మ పత్రిక వ్రాయించుకుని దోషాలు ఏమైనా ఉన్నాయో జ్యోతిష పండితుని అడిగి తెలుసుకుని... శిశువు పుట్టిన 27 రోజుల లోపు శాంతి జరిపించుకోవాలి. ఎంత ఆలస్యం చేస్తే అన్ని సమస్యలు ఎదురౌతుంటాయి. సాధ్యమైనంత తొందరలో జరిపించుకోవడం ఉత్తమం.శిశువు 12 సం.రాలు దాటిన తర్వాత ద్వాదశ భావ ఫలితాలు గురించి తెలుసుకోవాలి.
* శిశువుకు 16 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత సంపూర్ణ జాతక విషయాలను అడిగి తెలుసుకోవాలి.
* అనుభవజ్ఞులైన జ్యోతిష పండితుడిని సంప్రదించి జాతక చక్రం వేయించుకుని జాతక ఫలితాలు తెలుసుకున్నాకా పండితుడికి స్వయం పాకం, దక్షిణ, పండ్లు ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలి.
మనో నిగ్రహమును సాధించుట ఎట్లు
మనస్సును గమనించుచుండగా అందు 'భావములు' పుట్టుచున్నవి. వానిని పట్టినచో వాని వెంటబడి పోవుటయే గాని, మనస్సును పట్టుట జరుగదు. భావముల వెంట బోయినచో నేకాగ్రత కలుగదు.
18, సెప్టెంబర్ 2022, ఆదివారం
అద్భుతమైన వరం.. బ్రహ్మముహూర్తం..!
పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే... ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనినే 'బ్రహ్మముహూర్తం' అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ. కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది. సూర్యోదయం అవడానికి, 98-48 నిమిషాల మధ్యకాలం ఇది.
నిజానికి తెల్లవారుజామును 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మముహుర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు. బ్రహ్మమూహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంలోనే మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది.
పురాణగాథ
బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై పురాణగాథలు ఉన్నాయి. కశ్యప బ్రహ్మకు, వినతకు జన్మించిన వాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు. ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలని కుతూహలంతో అండం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్త కాలమంటారు. ఆ సమయమున ఏ నక్షత్రాలు, గ్రహలుగాని చెడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు. అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభ కార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతోంది. ఈ బ్రహ్మ ముహూర్తకాలమున చదివే చదువు.. చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు.
ఏం చేయాలి..?
ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మముహూర్తం. ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్ధులకు, ధ్యానం, జపతపాదులు చేయువారికి చాలా విలువైన సమయం. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తుంటుంది. మనసు స్వచ్ఛంగా తెల్లకాగితంలా దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగ ద్వేషాలు, ఇష్టాయిష్టాలు లేని సమయం.
ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అటు తేలికగా మారుతుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు, ఋషులు... హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపఃశక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపచేస్తారు. అందువలన ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది. అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతుంటారు. ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనలు లేకపోయినా కనీసం మేలుకొని ఉండమంటారు మన పెద్దవాళ్లు.
చల్లని నీటితో తలస్నానం చాలా మంచిది. దీంతో మెదడు, కళ్లు చల్లగా ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణాయామం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయటం చాలా మంచిది.
బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని వృధా చేయకూడదు. పూజలకు, యోగాకు, ప్రాణాయామానికి ఉపయోగించుకోవాలి. పద్మాసనంలో గానీ, సుఖాసనంలో గానీ కూర్చుని చేసే ధ్యానానికి అ సమయంలో మనోశక్తి లభిస్తుంది. మొదలుపెట్టే ముందు 12 సార్లు ఓంకారం, 5 నిముషాలు ఏదైన కీర్తన పాడటం వలన మనసు త్వరగా భగవధ్యానంలో ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది.
బ్రహ్మముహుర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది. అందుకే ఋషులు, యోగులు, ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు. ఎపుడైతే మన నాసిక రంధ్రాలలోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పని చేయడం మొదలుపెడుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది. ముందు మనం మన అంతర్యామిలోని ఆత్మలో లీనమై తద్వారా పరమాత్మను చేరుకుంటాము.